ఈ లోకమంతా ముసుగు వేసుకున్న మనుషులే. పైకి మనకు కనిపించే ముసుగు వేరు. లోపల అసలు ముఖం వేరు. ముసుగులు వేసుకున్న ముఖాలతోనే జనాలు సమాజంలో తిరుగుతున్నారు. కాకపోతే అందులో కొందరు మంచి వారు. ఇంకొందరు చెడు పనులు చేసే వారు. మరి ఇంకో రకం వారు కూడా ఉన్నారు. వారిని మంచి వారని అనలేం.
CLICKHERE : నోటు ప్రింట్ వేసేందుకు ఎంత ఖర్చవుతుందో తెలిస్తే షాక్ అవుతారు
CLICKHERE : గాలి జనార్దనరెడ్డి కూతురి పెళ్లి చీర,నగలు ఖరీదు తెలిస్తే దిమ్మ దిరగాల్సిందే..!
అలాగనీ చెడ్డ పనులు చేసిన వారూ కాదు. కానీ డబ్బు మాత్రం బాగానే కూడబెట్టారు. ముసుగు ప్రపంచంలో ధనికులుగా, బయటికి ప్రపంచానికి యాచకులుగా ఉన్నవారు తాజాగా ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయంతో తమ ముసుగును తీసేసి అసలు స్వరూపం బయట పెట్టుకుంటున్నారు. వారే బిచ్చగాళ్లుగా ఉన్న ధనికులు..!
వారు నిజంగా బిచ్చగాళ్లే. నిత్యం బిచ్చమెత్తుకోవడమే వారి పని. అలా యాచకం చేసీ చేసీ డబ్బు కూడబెట్టుకున్నారు. అది కాస్తా భారీ మొత్తమే అయింది. ఈ క్రమంలో తాజాగా వచ్చిన నోట్ల రద్దు నిర్ణయంతో వారికి ఏం చేయాలో తెలియడం లేదు. ఇన్నేళ్లూ డబ్బు దాచుకోవడమే వారు చేశారు. కానీ దాన్ని ఎలా బ్యాంక్లో వేసుకోవాలో తెలియదు.
అది మధ్యప్రదేశ్లోని దేవాస్ ప్రాంతం. అక్కడ ఓ అంధుడైన బిచ్చగాడు తాను ఎంతో కాలంగా బిచ్చమెత్తుకుని సంపాదించిన రూ.98వేలను తెలిసిన వారి వద్ద దాచుకున్నాడు. నోట్ల రద్దుతో వారు కాస్తా ఆ డబ్బును బిచ్చగాడికి తిరిగిచ్చేశారు. దీంతో ఆ డబ్బును ఏం చేయాలో తెలియక సదరు బిచ్చగాడు ఆ ఊరి సర్పంచ్ వద్దకు వెళ్లాడు. అతను ఆ బిచ్చగాడి సమస్యను తీర్చే పనిలో పడ్డాడు. అతనికి ఎలాంటి ఐడీ ప్రూఫ్ లేదు. బ్యాంక్ అకౌంట్ అంతకన్నా లేదు. మరి ఆ సర్పంచ్ ఏం చేస్తాడో చూడాలి. గ్వాలియర్లో ఓ మహిళ కూడా ఇలాగే రూ.60 లక్షలను దాచి పెట్టిందట. ఇప్పుడామె పరిస్థితిని అక్కడి పోలీసులు పర్యవేక్షిస్తున్నారు.
అది మధ్యప్రదేశ్లోని దేవాస్ ప్రాంతం. అక్కడ ఓ అంధుడైన బిచ్చగాడు తాను ఎంతో కాలంగా బిచ్చమెత్తుకుని సంపాదించిన రూ.98వేలను తెలిసిన వారి వద్ద దాచుకున్నాడు. నోట్ల రద్దుతో వారు కాస్తా ఆ డబ్బును బిచ్చగాడికి తిరిగిచ్చేశారు. దీంతో ఆ డబ్బును ఏం చేయాలో తెలియక సదరు బిచ్చగాడు ఆ ఊరి సర్పంచ్ వద్దకు వెళ్లాడు. అతను ఆ బిచ్చగాడి సమస్యను తీర్చే పనిలో పడ్డాడు. అతనికి ఎలాంటి ఐడీ ప్రూఫ్ లేదు. బ్యాంక్ అకౌంట్ అంతకన్నా లేదు. మరి ఆ సర్పంచ్ ఏం చేస్తాడో చూడాలి. గ్వాలియర్లో ఓ మహిళ కూడా ఇలాగే రూ.60 లక్షలను దాచి పెట్టిందట. ఇప్పుడామె పరిస్థితిని అక్కడి పోలీసులు పర్యవేక్షిస్తున్నారు.
ఢిల్లీలోని శివ్పురి ఏరియాలో ఉండే మరో వ్యక్తి వద్ద కూడా పెద్ద గోనె సంచిలో రూ.500, రూ.1000 నోట్లు ఉన్న కట్టలు బయట పడ్డాయి. పూణెలో చెత్త కుండీలో పడి ఉన్న రూ.1.50 లక్షలను ఓ మహిళ, మరో వ్యక్తి పంచుకున్నారు కూడా. అయితే ఆ డబ్బు ఎలా వచ్చిందనేది మాత్రం తెలియదు. ఏది ఏమైనా ఇలాంటి పరిస్థితిలో ఉన్న వారందరూ తమ వద్ద ఉన్న డబ్బును ఎలా మార్పిడి చేసుకుంటారో, ఎందులో డిపాజిట్ చేసుకుంటారో వేచి చూస్తే తెలుస్తుంది.