అగస్టాపై సభలో రచ్చ.. మొత్తం బయటపెడతామన్న బీజేపీ.. మోస్ట్ వెల్ కమ్ అన్న సోనియా

 

అగస్టా వెస్ట్ ల్యాండ్ కుంభకోణంపై అధికార, ప్రతిపక్ష పార్టీలతో రాజ్యసభ దద్దరిల్లిపోతోంది. అగస్టా స్కాంపై చర్చను ప్రారంభించిన బీజేపీ నేత భూపేంద్ర యాదవ్.. ఒప్పందంలో అక్రమాలు జరిగేందుకు వీలుగా యూపీఏ ప్రభుత్వం దొడ్డిదారిన అనుమతులు ఇచ్చిందని కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. దీనికి కాంగ్రెస్ నేత అభిషేక్ సింఘ్వీ స్పందిస్తూ.. ఆధారాలు లేకుండా అధికార పక్షం ఇలా మాట్లాడటం సరికాదని.. ఆ ఒప్పందాన్ని రద్దు చేసింది యూపీఏ ప్రభుత్వం అన్న విషయం గుర్తుంచుకోవాలని ఆయన సూచించారు. ఇంకా దీనిపై బీజేపీ నేతలు మాట్లాడుతూ.. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు రక్షణ మంత్రి రాజ్యసభ ముందు ఉంచుతారు అని చెప్పగానే.. దానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ మోస్ట్ వెల్ కమ్ అన్నారు. ఈ విషయంలో అన్ని విషయాలను బయటపెట్టాలని ఆమె డిమాండ్ చేశారు